మెదక్ 13వ వార్డులో రూ.1.06 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం

 


Telugu Trends

మెదక్ 13వ వార్డులో రూ.1.06 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం

డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు ప్రత్యేక చొరవతో అభివృద్ధి పనులు

ప్రతి వార్డుకు సమాన ప్రాధాన్యంతో మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యం

మెదక్, ఆగస్టు 07 (Telugu Trends):

మెదక్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు నిరంతరం కృషి చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఆయన ప్రత్యేక చొరవతో మెదక్ పట్టణంలోని 13వ వార్డులో రూ.1.06 కోట్ల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శుక్రవారం శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అభివృద్ధి అంటే కేవలం ప్రకటనలు కాదని, ప్రజల జీవితాల్లో కనిపించే మార్పేనని పేర్కొన్నారు. మెదక్ పట్టణంలోని ప్రతి వార్డుకు సమాన ప్రాధాన్యం కల్పిస్తూ నాణ్యమైన రహదారులు, డ్రైనేజీలు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

13వ వార్డు ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభం కావడం ఆనందదాయకమని పేర్కొన్నారు. పనులు పూర్తయిన అనంతరం ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని, డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు నాయకత్వంలో మెదక్ పట్టణంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ కానుగు రాధిక భూపతి రాజ్, వైస్ చైర్మన్ నరేష్ గౌడ్, కౌన్సిలర్ చెదల్ సంధ్య నవీన్ కుమార్, అస్తరుగల్ల బాలరాజ్, రాజశేఖర్, అరుణ, సిద్ధిరాములు, కో-ఆప్షన్ సభ్యురాలు అనూష, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

ads

ads