టేక్మాల్ విద్యుత్ కార్యాలయం వద్ద ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు: ఏఈ ఉదయ్ భాస్కర్
పాపన్నపేట, ఆగస్టు 15 (తెలుగు ట్రెండ్స్ – టేక్మాల్): టేక్మాల్ విద్యుత్ కార్యాలయం వద్ద శనివారం రోజు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఏఈ బి.ఉదయ్ భాస్కర్ జండా వద్ద కొబ్బరి కాయ కొట్టి జండవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంతో మంది దేశ భక్తులు త్యాగాల ఫలితంగానే మనం ఈరోజు స్వేచ్చగా జీవిస్తున్నామని పేర్కొన్నారు.ప్రతీ ఒక్కరూ దేశం కోసం పోరాడాలని, తాము నిర్వహిస్తున్న విధులు అంకిత భావంతో పూర్తి చేయాలని సూచించారు. ఈకార్యక్రమంలో విద్యుత్ లైన్ ఇన్స్పెక్టర్లు దుర్గా ప్రసాద్,సూర్య నారాయణ,లైన్ మేన్లు బి. దుర్గయ్య, పాండ్యు నాయక్, ఏఎల్ ఏం పండిత్, జూనియర్ లైన్మెన్ పడమటి రవి, బానోత్ అశోక్,లైన్మెన్ షాదుల్లా,పట్టణ హెల్పర్ ఎండీ.శౌకత్,ఆపరేటర్లు సుధాకర్,యాదగిరి,నారాయణ,ఆర్టిజన్లు కిషన్,అశోక్,తదితరులు పాల్గొన్నారు.అనంతరం స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు.


కామెంట్ను పోస్ట్ చేయండి