తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
తూప్రాన్ (తెలుగు ట్రేండ్స్): 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని టోల్ ప్లాజా వద్ద ఐఎన్టీయూసీ (INTUC) ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ నాయకులు చిట్కుల్ మహిపాల్ రెడ్డి టోల్ ప్లాజా ఆవరణలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కార్మికుల హక్కుల సాధనకు, వారి సంక్షేమానికి ఐఎన్టీయూసీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు, టోల్ ప్లాజా సిబ్బంది మరియు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. రిపోర్ట్ :R. చంద్రశేఖర్


కామెంట్ను పోస్ట్ చేయండి