బెస్ట్ అవార్డుతో బసన్నపల్లె మల్లేశం సత్కారం
సంగారెడ్డి, ఆగస్టు 7: నవతెలంగాణ 2025–26 సంవత్సరానికి గాను అందించే బెస్ట్ స్టోరీ అవార్డును జర్నలిస్టు రామాయంపేట కు చెందిన
బసన్నపల్లె మల్లేశం అందుకున్నారు. సంగారెడ్డి జిల్లా పరిషత్ హాల్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో నవతెలంగాణ ఎడిటర్ రాంపల్లి రమేష్ చేతుల మీదుగా ఆయన అవార్డును స్వీకరించారు.
ఉత్తమ కథన రచనకు గుర్తింపుగా ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు లభించడం పట్ల జర్నలిస్టు వర్గాలు, మిత్రులు, శ్రేయోభిలాషులు బసన్నపల్లె మల్లేశంకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులోనూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చే మరిన్ని ఉత్తమ కథనాలు అందించాలని ఆకాంక్షించారు.


కామెంట్ను పోస్ట్ చేయండి