తెలుగు ట్రెండ్స్
తెలంగాణ జర్నలిస్ట్ సంఘం రాష్ట్ర అధ్యక్షుల మాతృమూర్తి మృతి పట్ల తీవ్ర సంతాపం
పాపన్నపేట, ఆగస్టు 22: తెలంగాణ జర్నలిస్ట్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వీరహత్ అలీ మాతృమూర్తి మృతి పట్ల రాష్ట్ర, జిల్లా జర్నలిస్ట్ యూనియన్ నాయకులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
శనివారం పాపన్నపేటలోని వీరహత్ అలీ నివాసానికి వెళ్లిన రాష్ట్ర, జిల్లా జర్నలిస్ట్ సంఘం నాయకులు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ దుఃఖ సమయంలో కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు.
పరామర్శించిన వారిలో పాపన్నపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బి. మోహన్ రాజ్ (సాక్షి), మిన్పూర్ శ్రీనివాస్ (ఆంధ్రజ్యోతి), ఉప్పు ఆనంద్ (వార్త), టి. శివచరణ్ సింగ్ (వార్త), సాయిలు (నవజ్యోతి) తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్: పి. శ్రీనివాస్ | తెలుగు ట్రెండ్స్ | పాపన్నపేట


కామెంట్ను పోస్ట్ చేయండి