వరి పంటలో నానో యూరియాపై క్షేత్ర ప్రదర్శన
నార్సింగి, ఆగస్టు 22 (తెలుగు ట్రెండ్స్ ): మండలంలోని జప్తి శివునూర్ గ్రామంలో రైతు గంగనబోయిన రాములు పొలంలో వ్యవసాయ శాఖ, ఆత్మ పథకం ఆధ్వర్యంలో వరి పంటలో నానో యూరియా వినియోగంపై క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ.. నానో యూరియా వినియోగంతో ఎరువుల ఖర్చు తగ్గడంతో పాటు పంట దిగుబడి పెరిగే అవకాశం ఉందన్నారు. 500 మిల్లీలీటర్ల నానో యూరియా ఒక బస్తా సాధారణ యూరియాకు సమానమని తెలిపారు.
లీటర్ నీటికి 3 మిల్లీలీటర్ల నానో యూరియా కలిపి నాటిన 25 రోజుల తర్వాత ఒకసారి, పూతకు వారం ముందు మరోసారి పిచికారీ చేయాలని రైతులకు సూచించా
రు. నానో యూరియాను సూచించిన మోతాదులో, సరైన పద్ధతిలో వినియోగించి ప్రయోజనం పొందాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏఈఓ జనార్దన్తో పాటు రైతులు పాల్గొన్నారు.
– రామాయంపేట బి. యాదగిరి, తెలుగు ట్రెండ్స్


కామెంట్ను పోస్ట్ చేయండి