బీకొండ నారాయణ కుటుంబానికి పద్మశాలి సంఘం అండ.. రూ.5 వేల ఆర్థిక సాయం

 


బీకొండ నారాయణ కుటుంబానికి పద్మశాలి సంఘం ఆర్థిక సాయం

పాపన్నపేట, ఆగస్టు 21 (తెలుగు ట్రెండ్స్ ): పాపన్నపేట మండల కేంద్రానికి చెందిన ఏడుపాయల దేవస్థానం మాజీ డైరెక్టర్, పద్మశాలి సంఘం నాయకుడు బీకొండ నారాయణ గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న పద్మశాలి సంఘం నాయకులు శుక్రవారం ఆయన కుటుంబాన్ని పరామర్శించి, అంత్యక్రియల నిమిత్తం రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ సందర్భంగా పద్మశాలి సంఘం అధ్యక్షుడు కొడపాక విట్టల్, ఉపాధ్యక్షుడు పల్లె సంగమేశ్వర్, పాపన్నపేట మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడు వళ్ళందేశి శ్రీనివాస్ తదితరులు నారాయణ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కార్యక్రమంలో కొడపాక శివశంకర్, పల్లె సాయి, పల్లె లక్ష్మణ్, గురునాథ్, దాసరి యాదయ్యతో పాటు పద్మశాలి సంఘం నాయకులు, బంధువులు పాల్గొన్నారు. అనంతరం ఆయన అంత్యక్రియల్లో సంఘం నాయకులు, Strength పాల్గొన్నారు.

– పి. శ్రీనివాస్, తెలుగు ట్రెండ్స్, పాపన్నపేట 📄 పూర్తి పేపర్ చూడండి

0/Post a Comment/Comments

ads

ads