కడుపునొప్పి భరించలేక విద్యార్థిని ఆత్మహత్య
మెదక్, ఆగస్టు 21 (తెలుగు ట్రెండ్స్): కడుపునొప్పితో బాధపడుతున్న ఓ విద్యార్థిని ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన పాపన్నపేట మండలం లక్ష్మీనగర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది.
పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీనగర్కు చెందిన వగ్గు రశిత (14) యూసుఫ్పేట ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. కొంతకాలంగా తరచూ కడుపునొప్పితో బాధపడుతూ పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నప్పటికీ నొప్పి తగ్గకపోవడంతో తీవ్రంగా ఇబ్బంది పడుతోంది.
శుక్రవారం ఉదయం కడుపునొప్పితో బాధపడుతూ ఇంట్లో దిగులుగా ఉన్న రశిత.. తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొంతసేపటి తర్వాత కుటుంబ సభ్యులు గమనించి వెంటనే చికిత్స కోసం **మెదక్ జనరల్ ఆసుపత్రి (GGH)**కు తరలించారు. అయితే వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
మృతురాలి తల్లి సాయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.
– శ్రీనివాస్, పాపన్నపేట | తెలుగు ట్రెండ్స్


కామెంట్ను పోస్ట్ చేయండి