విద్యార్థుల చదువుకు ప్రభుత్వం చేయూత.. వెల్దుర్తిలో నోట్బుక్స్ పంపిణీ
ప్రభుత్వ కళాశాలలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు 12 నోట్బుక్స్ చొప్పున అందజేత
వెల్దుర్తి, ఆగస్టు 11:
విద్యార్థుల విద్యాభ్యాసానికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని వెల్దుర్తి శ్రీ రాయారావు సరస్వతి మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు మంగళవారం కళాశాలలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఒక్కొక్కరికి 12 నోట్బుక్స్ చొప్పున అందజేశారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న నోట్బుక్స్ను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని చదువులో మరింతగా రాణించాలని ప్రిన్సిపల్ శ్రీనివాసులు సూచించారు.
విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని అందించడం ద్వారా వారి చదువుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని తెలిపారు. కళాశాలకు హాజరుకాని విద్యార్థులు సైతం కళాశాలకు వచ్చి తమకు కేటాయించిన నోట్బుక్స్ను తీసుకోవాలని సూచించారు.
నోట్బుక్స్ పంపిణీతో విద్యార్థులకు చదువులో కొంతమేర ఆర్థిక భారం తగ్గుతుందని, ప్రభుత్వ పథకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులతో పాటు అధ్యాపకులు, నాన్-టీచింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తెలుగు ట్రెండ్స్ – మెదక్


కామెంట్ను పోస్ట్ చేయండి