లాంగ్ మెమోలు.. సర్టిఫికెట్లు రెడీ!
ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణులు కళాశాలకు వచ్చి తీసుకోవాలి: ప్రిన్సిపల్ శ్రీనివాసులు
వెల్దుర్తి మండలం, ఆగస్టు 22 (తెలుగు ట్రెండ్స్): వెల్దుర్తి మండల కేంద్రంలోని శ్రీమతి రాయారావు సరస్వతి మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణులైన విద్యార్థులకు సంబంధించిన లాంగ్ మెమోలు, సర్టిఫికెట్లు కళాశాలకు చేరుకున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు తెలిపారు.
మార్చి 2026లో జరిగిన వార్షిక పరీక్షలు, మే 2026లో నిర్వహించిన సప్లిమెంటరీ పరీక్షల్లో ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణులైన విద్యార్థుల లాంగ్ మెమోలు, సర్టిఫికెట్లు కళాశాలకు అందినట్లు ఆయన వెల్లడించారు. సంబంధిత విద్యార్థులు సోమవారం నుంచి కళాశాలకు వచ్చి తమ ఒరిజినల్ లాంగ్ మెమోలు, సర్టిఫికెట్లను స్వీకరించుకోవాలని సూచించారు.
ఉన్నత విద్య, ఉద్యోగాలు, ఇతర అవసరాలకు సంబంధించి విద్యార్థులకు లాంగ్ మెమోలు, సర్టిఫికెట్లు ఎంతో ముఖ్యమైనవని ప్రిన్సిపల్ తెలిపారు. అందువల్ల విద్యార్థులు ఆలస్యం చేయకుండా కళాశాలకు వచ్చి తమకు సంబంధించిన ధ్రువపత్రాలను తీసుకోవాలని సూచించారు.
ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణులైన విద్యార్థులందరూ ఈ విషయాన్ని గమనించి, నిర్ణీత సమయం నుంచి కళాశాలకు వచ్చి తమ లాంగ్ మెమోలు, సర్టిఫికెట్లను స్వీకరించుకోవాలని ప్రిన్సిపల్ శ్రీనివాసులు కోరారు.
రిపోర్టర్: నర్సింహ గౌడ్
వెల్దుర్తి మండలం
తెలుగు ట్రెండ్స్


కామెంట్ను పోస్ట్ చేయండి