గ్రామాల్లో దోమల మందు పిచికారి చేసేది ఎప్పుడు? వర్షాకాలం వచ్చి నెలలు గడుస్తున్నా.. దోమల నివారణ చర్యలు ఏవీ?

 గ్రామాల్లో దోమల మందు పిచికారి చేసేది ఎప్పుడు?


వర్షాకాలం ప్రారంభమై నెలలు గడుస్తున్నా పిచికారి చేయని వైనం


కొల్చారం, ఆగస్టు 26 (నవ పలుకులు): మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని పలు గ్రామాల్లో దోమల బెడద తీవ్రంగా ఉన్నప్పటికీ ఇప్పటివరకు దోమల మందు పిచికారి చేయకపోవడంపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో 21 గ్రామ పంచాయతీలు ఉండగా, వర్షాకాలం ప్రారంభమై నెలలు గడుస్తున్నా చాలా గ్రామాల్లో దోమల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.


వర్షాలు కురుస్తుండటంతో గ్రామాల్లోని మురుగు కాలువలు, ఖాళీ ప్రదేశాలు, నీరు నిలిచే ప్రాంతాల్లో దోమలు విపరీతంగా పెరుగుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. రాత్రి వేళల్లో దోమల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటున్నారు.


వర్షాకాలంలో దోమల నియంత్రణకు ముందస్తు చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ గ్రామాల్లో దోమల మందు పిచికారి చేయకపోవడం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దోమల వల్ల డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్నందున అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.


గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణతో పాటు మురుగు కాలువలను శుభ్రం చేయడం, నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి తొలగించడం, అవసరమైన చోట దోమల మందు పిచికారి చేయడం వంటి చర్యలు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు, మండల అధికారులు గ్రామాల పరిస్థితిని పరిశీలించి దోమల నివారణ చర్యలను వేగవంతం చేయాలని కోరుతున్నారు.


ఇప్పటికైనా గ్రామ పంచాయతీ పాలకవర్గాలు, సంబంధిత అధికారులు స్పందించి అన్ని గ్రామాల్లో దోమల మందు పిచికారి చేయడంతో పాటు పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


నవ పలుకులు – రిపోర్టర్‌: ముత్త


య్య, కొల్చారం

0/Post a Comment/Comments

ads

ads