15వ వార్డులో తాగునీటి సమస్యకు చెక్.. బోరును వినియోగంలోకి తెచ్చిన వైస్ చైర్మన్

 


15వ వార్డులో తాగునీటి సమస్యకు పరిష్కారం

బోరును మరమ్మతులు చేయించి వినియోగంలోకి తీసుకొచ్చిన వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్

నవ పలుకులు – మెదక్, ఆగస్టు 25:

మెదక్ పట్టణంలోని 15వ వార్డులో వినియోగంలో లేకుండా ఉన్న బోరును మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ చొరవతో మరమ్మతులు చేయించి తిరిగి వినియోగంలోకి తీసుకువచ్చారు. బోరు పనిచేయకపోవడంతో స్థానికులు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను వైస్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించారు.

మంగళవారం 15వ వార్డులో పర్యటించిన దొంతి నరేష్ గౌడ్.. వినియోగానికి వీలు లేకుండా ఉన్న బోరును పరిశీలించారు. అనంతరం సంబంధిత మున్సిపల్ సిబ్బందితో మాట్లాడి వెంటనే మరమ్మతు పనులు చేపట్టాలని సూచించారు. సిబ్బంది మరమ్మతులు పూర్తి చేయడంతో బోరు తిరిగి వినియోగంలోకి వచ్చింది.

బోరు అందుబాటులోకి రావడంతో 15వ వార్డు ప్రజలకు తాగునీటి సమస్య నుంచి ఉపశమనం లభించింది. తమ సమస్యను వైస్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే స్పందించి ఎలాంటి జాప్యం లేకుండా పరిష్కరించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్యను పరిష్కరించినందుకు దొంతి నరేష్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా దొంతి నరేష్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారుల సహకారంతో సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

బోరు మరమ్మతులు చేయించి నీటి సమస్యను పరిష్కరించడంతో స్థానికులు వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్‌కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

0/Post a Comment/Comments

ads

ads