: అమెరికాలో ఏపీ టెక్కీకి విషాదాంతం.. వరదల్లో కొట్టుకుపోయి మృతి

అమెరికాలో విషాదం.. వరదల్లో కొట్టుకుపోయిన ఏపీ టెక్కీ వెంకటేష్ మృతి

అమెరికాలోని Kansas రాష్ట్రంలో సంభవించిన ఆకస్మిక వరదల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 33 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దొప్పలపూడి వెంకటేష్ దుర్మరణం పాలయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న కారు వరద నీటిలో కొట్టుకుపోవడంతో గల్లంతయ్యారు. అనంతరం అమెరికా అధికారులు చేపట్టిన గాలింపు చర్యల్లో ఆయన మృతదేహాన్ని గుర్తించారు. 

వెంకటేష్ ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా, పర్చూరు మండలం, దేవరపల్లి గ్రామానికి చెందినవారు. ఆయన అమెరికాలోని నెబ్రాస్కా రాష్ట్రంలోని ఒమాహాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కాన్సాస్‌లో వరదలు సంభవించగా, ఆయన ప్రయాణిస్తున్న కారు నీటి ప్రవాహంలో చిక్కుకుంది.

0/Post a Comment/Comments

ads

ads