భారత్–ఇంగ్లాండ్ మధ్య రేపటి నుంచి 5 మ్యాచ్ల టీ20 సిరీస్.. యువ సంచలనాలపై అందరి చూపు.. వైభవ్ సూర్యవంశీ మెరవనున్నాడా?
హైదరాబాద్ జూన్ 30 క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్–ఇంగ్లాండ్ ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ రేపటి నుంచి ఇంగ్లాండ్లో ప్రారంభం కానుంది. రెండు బలమైన జట్లు తలపడుతుండటంతో ఈ సిరీస్పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రతి మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
భారత జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా వ్యవహరిస్తుండగా, ఈ సిరీస్లో యువ ఆటగాళ్లకు తమ ప్రతిభను నిరూపించుకునే మంచి అవకాశం లభించింది. ముఖ్యంగా సంచలన యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీపై అందరి దృష్టి నిలిచింది. అతనితో పాటు దూకుడైన ఓపెనర్ అభిషేక్ శర్మ, వికెట్ కీపర్ సంజు శాంసన్, ఇషాన్ కిషన్, అలాగే కొత్త ముఖాలు ప్రిన్స్ యాదవ్ మరియు సూర్యాంశ్ షెడ్గే ఈ సిరీస్లో ఎలా రాణిస్తారో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఇంగ్లాండ్ జట్టుకు యువ స్టార్ హ్యారీ బ్రూక్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. అతనితో పాటు మాజీ కెప్టెన్ జోస్ బట్లర్, ప్రమాదకర ఓపెనర్ ఫిల్ సాల్ట్, బెన్ డకెట్, జేకబ్ బెతెల్, లియామ్ లివింగ్్స్టోన్, వంటి స్టార్ ఆటగాళ్లు భారత జట్టుకు గట్టి సవాల్ విసరనున్నారు.
ఈ సిరీస్లో భారత్ యువ ఆటగాళ్ల ప్రదర్శనపై ప్రత్యేక దృష్టి ఉంది. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ప్రిన్స్ యాదవ్ వంటి యువ క్రికెటర్లు అవకాశాన్ని ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ, అర్ష్దీప్ సింగ్ బౌలింగ్, అక్షర్ పటేల్ ఆల్రౌండ్ ప్రదర్శన జట్టు విజయానికి కీలకం కానున్నాయి.
స్వదేశంలో ఆడుతున్న ఇంగ్లాండ్ను ఓడించడం అంత సులభం కాదు. అయినప్పటికీ యువ ఆటగాళ్ల జోష్తో భారత్ సిరీస్ను కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఐదు మ్యాచ్ల ఈ పోరులో ఎవరు ఆధిపత్యం చాటుతారో చూడాలని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.


إرسال تعليق